నేరేడుచర్ల, మే 18 ,శుభోదయ డైనమిక్ వార్త
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో యోగ, మెడిటేషన్ మరియు వాక్ మారథాన్ కార్యక్రమాలను సోమవారం జిల్లా పరిషత్ హైస్కూల్ నేరేడుచర్లలో నిర్వహించారు. విద్యార్థులు, యువతలో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, శారీరక దృఢత్వం సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
అధికారుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి, ఎంపీవో నాగరాజు, ఎంఈఓ బాలునాయక్, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మధు పాల్గొని విద్యార్థులకు యోగ, ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు.
యోగా టీచర్ శృతి ఆధ్వర్యంలో కార్యక్రమం
యోగా టీచర్ బి. శృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ, మెడిటేషన్ సెషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన వాక్ మారథాన్లో విద్యార్థులు, యువత, పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
