కారంపూడి, మే 19 ,శుభోదయ డైనమిక్ వార్త
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు చేపడుతున్న నిరసనలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీ చైర్మన్-4 పంగులూరి అంజయ్య విమర్శించారు. మంగళవారం కారంపూడిలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో ధరలు పెరిగినప్పుడు ఎందుకు మౌనం?
2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా అప్పట్లో ఒక్క మాట కూడా మాట్లాడని నేతలు, ఇప్పుడు నిరసనలకు దిగడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల కాదని, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు మరియు కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావంతో పెరిగాయని తెలిపారు.
ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న అంజయ్య
ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నేతలు అవసరం లేని అంశాలపై రోడ్డెక్కుతున్నారని పంగులూరి అంజయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశాలపై ధర్నాలు చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
చంద్రబాబు పాలనపై ప్రశంసలు
దేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అంజయ్య పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో నిరాధార ఆరోపణలు చేసి ప్రజలతో మరోసారి వ్యతిరేకత తెచ్చుకోకూడదని వైసీపీ నేతలకు సూచించారు.
సమావేశంలో టీడీపీ నాయకుల పాల్గొనడం
ఈ మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
