Tuesday, May 19, 2026
Homeతాజా సమాచారంఇతర రాష్ట్రాల కార్మికులకు పోలీసుల కౌన్సెలింగ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన నేరేడుచర్ల ఎస్ ఐ సైది...

ఇతర రాష్ట్రాల కార్మికులకు పోలీసుల కౌన్సెలింగ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన నేరేడుచర్ల ఎస్ ఐ సైది రెడ్డి

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, మే 19

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు సూచనలతో మంగళవారం నేరేడుచెర్ల పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్సై సైది రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని రైస్ మిల్లులు మరియు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.

నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచనలు

కార్మికులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎలాంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక చట్టాలు, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని పోలీసులు అవగాహన కల్పించారు.

ఆధార్ వివరాలు, ఫింగర్ ప్రింట్ల సేకరణ

అనంతరం తహశీల్దార్ సమక్షంలో కార్మికులపై బైండ్ ఓవర్ ప్రక్రియ నిర్వహించారు. వారి ఆధార్ కార్డుల వివరాలు నమోదు చేయడంతో పాటు ఫింగర్ ప్రింట్లను కూడా సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

మండలంలో శాంతిభద్రతలు కాపాడడం, అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments