Tuesday, July 28, 2026
Homeతాజా సమాచారంమఠంపల్లి మండలంలో మరుగుదొడ్లపై ఇంటింటి సర్వే254 ఇళ్లను గుర్తింపు.. యాప్‌లో వివరాల నమోదు

మఠంపల్లి మండలంలో మరుగుదొడ్లపై ఇంటింటి సర్వే254 ఇళ్లను గుర్తింపు.. యాప్‌లో వివరాల నమోదు

శుభోదయ డైనమిక్ న్యూస్, మఠంపల్లి,జులై 4

మఠంపల్లి మండల కేంద్రంతో పాటు పెదవీడు, రఘునాథపాలెం, బహుమతులగూడెం తదితర గ్రామాల్లో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంటింటి మరుగుదొడ్లపై సర్వే నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను అంచనా వేసి, మరుగుదొడ్ల సౌకర్యం లేని ఇళ్ల వివరాలను సేకరించారు.

80 శాతం ఇళ్లలో మరుగుదొడ్లు లేవు

మఠంపల్లి ఎస్సీ కాలనీలో సర్వే నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 254 ఇళ్లను గుర్తించగా, తొలి దశలో 50 ఇళ్లలో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వేలో సుమారు 80 శాతం ఇళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోయినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.

యాప్‌లో నమోదు.. తదుపరి చర్యలకు నివేదిక

సర్వే ద్వారా సేకరించిన వివరాలను ప్రభుత్వ యాప్‌లో నమోదు చేసి, సంబంధిత అధికారులకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా మరుగుదొడ్లు లేని కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

సర్వేలో పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు లక్ష్మణ్ నాయక్, ప్రవీణ్, నారమ్మ, ఇంటి రవి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments