నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, మే 14
నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ ఉప సర్పంచ్ దనమ్మ భర్త ఎదురుగట్ల సంజీవ (వయస్సు సుమారు 33) బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మృతి చెందారు.
అనారోగ్యంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సంజీవ గత మూడు రోజులుగా అనారోగ్యంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు, లివర్ పనిచేయకపోవడంతో హైదరాబాద్ కు రిఫర్ చేయగా హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గ్రామంలో విషాద ఛాయలు
సంజీవ మృతి వార్త తెలిసిన వెంటనే లాల్ లక్ష్మీపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కుటుంబ పరిస్థితి
మృతుడు సంజీవకు భార్య దనమ్మతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా, కుమారుడు ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు.
