శుభోదయ డైనమిక్ న్యూస్ – పాలకవీడు, ఆగస్టు 23
గుండ్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లెంగులగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి బోనాల పండగను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్ష
ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లిని ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
