Friday, September 11, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పోలియో రహిత సమాజం నిర్మిద్దాంజీవితానికి రెండు చుక్కలు – డాక్టర్ పృథ్వి

పోలియో రహిత సమాజం నిర్మిద్దాంజీవితానికి రెండు చుక్కలు – డాక్టర్ పృథ్వి

డైనమిక్ న్యూస్, పర్చూరు,డిసెంబర్ 20

పల్స్ పోలియో అవగాహన ర్యాలీ
రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పర్చూరులో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో పోలియో నివారణపై విస్తృత అవగాహన కల్పించారు.బొమ్మ సెంటర్లో అవగాహన కార్యక్రమంర్యాలీ అనంతరం స్థానిక బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ పృథ్వి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి

డాక్టర్ పృథ్వి మాట్లాడుతూ మానవ శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా జీవనం కష్టసాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజాప్రతినిధుల విస్తృత పాల్గొనడం

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్, రోటరీ సభ్యులు, ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ శాంతి సాయి, సిడిపిఓ సుభద్ర, అంగన్వాడీ కార్యకర్తలు, హైటెక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments