హుజూర్నగర్, శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 30
హుజూర్నగర్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంటు సైదులు గృహంలో నిర్వహించిన ఉప్పల మైసమ్మ వేడుకల్లో హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది, హుజూర్నగర్కు చెందిన కుక్కడపు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా ఉప్పల మైసమ్మ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు. వేడుకలకు ఉదయ్ కుమార్ హాజరుకావడంపై బంటు సైదులు సంతోషం వ్యక్తం చేశారు.
పలువురు పాల్గొనడం
ఈ కార్యక్రమంలో డైనమిక్ రిపోర్టర్ బత్తిని వీరప్రసాద్, బాలెబోయిన వివేక్, బాలెబోయిన యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
