యడ్లపాడు,డైనమిక్ , అక్టోబర్ 29
జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా తిమ్మాపురం పరిధిలోని 16వ నెంబరు జాతీయ రహదారి బైపాస్ అండర్పాస్ వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారు హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ
“నీటి నిల్వ వలన వాహన రాకపోకలకు అంతరాయం కలగకూడదు. డ్రైనేజ్ ద్వారా తక్షణమే నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు.అదేవిధంగా, వర్షపు నీరు గ్రామ పట్టు పొలాల్లోకి వెళ్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హైవే శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
