నేరేడు చర్ల, ఏప్రిల్ 16,శుభోదయ డైనమిక్ వార్త
నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి గ్రామ పంచాయతీకి ఒకే కార్యదర్శి పనిచేస్తుండడంతో పరిపాలనలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.
ఉమ్మడి వ్యవస్థ వల్ల సమస్యలు
గ్రామ పంచాయతీ విభజన జరిగినప్పటికీ, కార్యదర్శి మాత్రం కల్లూరు , లాల్ లక్ష్మీపురం గ్రామాల కు ఉమ్మడిగానే కొనసాగుతున్నారని ప్రజలు పేర్కొన్నారు. ఒకే కార్యదర్శి రెండు గ్రామాల బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో సేవలు ఆలస్యమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పుట్టిన, మరణ ధృవపత్రాలు, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి అంశాల్లో ఆలస్యాలు జరుగుతున్నాయని తెలిపారు.
అభివృద్ధి పనులు మందగింపు
గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు సరైన పర్యవేక్షణ లేక ఆలస్యం అవుతున్నాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కార్యదర్శి తరచుగా అందుబాటులో లేకపోవడంతో పథకాల అమలు కూడా సరిగా జరగడం లేదని వారు విమర్శించారు.
అధికారుల దృష్టికి విజ్ఞప్తి
లాల్ లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి ప్రత్యేక కార్యదర్శిని వెంటనే నియమించాలని సంబంధిత అధికారులను గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామ పరిపాలన సమర్థవంతంగా సాగాలంటే ఇది అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు.
త్వరితగతిన చర్యలు తీసుకోవాలి
ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జిల్లా స్థాయి అధికారులు త్వరగా స్పందించి, గ్రామానికి ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల గ్రామ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపిడిఓ సోమ సుందర్ రెడ్డి వివరణ
బదిలీలు జరిగినప్పుడు కచ్చితంగా లాల్ లక్ష్మీపురం గ్రామానికి ప్రత్యేక కార్యదర్శిని నియమిస్తాము అని తెలిపారు
