Sunday, April 19, 2026
Homeతాజా సమాచారంటేక్మాల్‌లో సి.సి. రోడ్ల పనులకు శ్రీకారంమంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో నిధులు – సర్పంచ్ సుధాకర్...

టేక్మాల్‌లో సి.సి. రోడ్ల పనులకు శ్రీకారంమంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో నిధులు – సర్పంచ్ సుధాకర్ ప్రారంభం

టేక్మాల్, ఏప్రిల్ 16 శుభోదయ డైనమిక్ వార్త

టేక్మాల్ మండల కేంద్రంలో రహదారి సమస్యల పరిష్కారానికి కీలక అడుగులు పడినాయి. చాలా కాలంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్ల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు.

మంత్రి చొరవతో నిధుల మంజూరు

గ్రామంలోని రోడ్ల దుస్థితిని సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ మరియు పంచాయతీ ప్రతినిధులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులు విడుదల చేశారు. టేక్మాల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

శంకుస్థాపన కార్యక్రమం

వడ్ల గల్లీలోని నాగులమ్మ గుడి నుంచి పాత పోస్టాఫీస్ వరకు నిర్మించనున్న సి.సి. రోడ్డు పనులను సర్పంచ్ సుధాకర్, డి.ఏ. (పి.ఆర్) విల్సన్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను సూచించారు.

మరిన్ని అభివృద్ధి పనులకు హామీ

గ్రామంలో మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్, మాజీ అధ్యక్షులు సుబేదార్ మణికిషన్, ఉప సర్పంచ్ ఎం. శంకరయ్య, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మజ్దూహార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశీలి సాగర్, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు బి. కిషోర్, వార్డు సభ్యులు ప్రభావతి, శ్రీలత, అమృతరావు, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు, వర్క్ ఇన్‌స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments