Thursday, April 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్బాపట్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శన సూర్యలంక బీచ్‌లో ఒకరోజు ప్రత్యేక పర్యటన పర్యటన...

బాపట్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శన సూర్యలంక బీచ్‌లో ఒకరోజు ప్రత్యేక పర్యటన పర్యటన పర్యవేక్షణ బాధ్యత జాయింట్ కలెక్టర్ భావనకు

డైనమిక్ న్యూస్, బాపట్ల, నవంబర్ 16

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ఆదివారం ఉదయం ఒకరోజు పర్యటన నిమిత్తం బాపట్ల జిల్లాలోని పాండురంగాపురం చేరుకున్నారు. అనంతరం సూర్యలంక సముద్రతీరంలోని గోల్డెన్ సాండ్స్ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లిన గవర్నర్‌ను జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన పూలమొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు.

పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ భావనకు

గవర్నర్ పర్యటన మొత్తం వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతను జాయింట్ కలెక్టర్ భావన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గవర్నర్ ఏడీఎస్ తదితర సిబ్బందికి అవసరమైన గదులను ఏర్పాటు చేయాలని ఆర్‌డీఓ, తహశీల్దార్లను ఆదేశించారు.

సెక్యూరిటీ, బందోబస్తు చర్యలు కట్టుదిట్టం

పర్యటన సందర్భంలో సెక్యూరిటీ ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని డీఎస్పీ రామాంజనేయులకు కలెక్టర్ సూచించారు. కాన్వాయి వాహనాల ఏర్పాటు కోసం జిల్లా రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అంబులెన్స్, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా డీఎం & హెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు.

శానిటేషన్–విద్యుత్–పత్రికల సరఫరా చర్యలు

సూర్యలంక బీచ్ పరిధి, బాపట్ల పట్టణంలో పూర్తి శానిటేషన్ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, డిపిఒలకు సూచనలు జారీ అయ్యాయి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గవర్నర్‌కు ఇంగ్లీష్, హిందీ పత్రికలను అందించాలని ఐ&పిఆర్ శాఖకు కూడా సూచించారు.

గవర్నర్‌ను కలిసిన అధికారులు

గవర్నర్‌ను బాపట్ల ఎమ్మెల్యే వర్మ, ఆర్డీఓ పి. గ్లోరియా, డీఎస్పీ రామాంజనేయులు, డిఆర్‌ఓ జి. గంగాధర్ గౌడ్, డిపిఒ ప్రభాకర్ రావు, డీఎం&హెచ్‌ఓ డా. విజయమ్మ, మున్సిపల్ కమిషనర్ రాఘునాథ్ రెడ్డి, బాపట్ల–చీరాల తహశీల్దార్లు షేక్ సలీం, గోపీకృష్ణ, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు కలిసి మర్యాదపూర్వకంగా పలకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments