పాలకవీడు, జనవరి 22 డైనమిక్ న్యూస్
జాన్ పహాడ్ దర్గా ఉరుసు సందర్భంగా భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కోదాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సేవలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
22, 23 తేదీల్లో ప్రత్యేక బస్సు సేవలు
ఈ ప్రత్యేక బస్సు సేవలు జనవరి 22 నుంచి 23, 2026 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ దర్గా వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నట్లు తెలిపారు.
తక్కువ చార్జీలతో ప్రయాణ సౌకర్యం
భక్తుల కోసం చార్జీలను సైతం తక్కువగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
పెద్దలకు : రూ.50/-
పిల్లలకు : రూ.30/- మాత్రమే వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
జాన్ పహాడ్ ఉరుసుకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ ప్రత్యేక బస్సు సేవల ప్రధాన ఉద్దేశమని కోదాడ డిపో అధికారులు తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో వినియోగించుకోవాలి
భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక బస్సు సేవలను వినియోగించి, సేవలను విజయవంతం చేయాలని కోదాడ డిపో అధికారులు కోరారు.
