సూర్యాపేట బ్యూరో , జూన్ 18, శుభోదయ డైనమిక్ వార్త
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్
ప్రతి మండలం నుంచి ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి దశలవారీగా మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలను అవసరాల ఆధారంగా గ్రేడ్లుగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీలు, క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
భవిష్యత్ నైపుణ్యాలపై దృష్టి
విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, కెరీర్ గైడెన్స్ వంటి అంశాల్లో శిక్షణ అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి
పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత కాకుండా ప్రజా ఉద్యమంగా సాగాలని, తల్లిదండ్రుల కమిటీలు, పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
