కారంపూడి, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 26
మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆదినారాయణ కాలనీలో ఏకే నాగమణి, కూరాకుల వెంకట శివయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరగగా, బస్టాండ్ సెంటర్లో మండల కార్యదర్శి షేక్ సైదా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు.
స్వాతంత్ర్య పోరాటంలో సిపిఐ పాత్ర
సైదా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, పేదలు–కార్మికులు–రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ సిపిఐ అని అన్నారు.ప్రజా సమస్యలపై డిమాండ్లు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విరమించి ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
