ఎపి డైనమిక్,విజయవాడ, అక్టోబర్ 19
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ పర్యటనలో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా బీసెంట్రోడ్లోని బాణసంచా వ్యాపారులను కలిసి, జీఎస్టీ 2.0 అమలుపై చర్చించనున్నారు. దీపావళి పండుగ సందర్భంగా పటాకుల విక్రయాలు, వ్యాపారుల సమస్యలపై సీఎం సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.సాయంత్రం పున్నమి ఘాట్లో నిర్వహించే దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే క్రాకర్స్ షోకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి రాష్ట్ర అభివృద్ధి, పండుగ ఉత్సవాల ప్రాధాన్యం గురించి వివరించనున్నారు.
