నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్
గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.డిసెంబర్ 17 వరకు గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని, అందువలన జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు .
