నేరేడుచర్ల, ఫిబ్రవరి 12, డైనమిక్ న్యూస్
నేరేడుచర్ల పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియపై గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. 15 వార్డులకు చెందిన మొత్తం 54 మంది పోటీ అభ్యర్థులకు కౌంటింగ్ విధానం, నిబంధనలపై అధికారులు సమగ్రంగా వివరించారు.
బ్యాలెట్ పేపర్ల పరిశీలనపై స్పష్టత
సదస్సులో భాగంగా వ్యాలిడ్ మరియు ఇన్వ్యాలిడ్ బ్యాలెట్ పేపర్ల గుర్తింపు విధానం, కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.
కమిషనర్ సీహెచ్. నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం
ఈ సదస్సుకు సహాయ జిల్లా ఎన్నికల అధికారి & కమిషనర్ సీహెచ్. నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడుతుందని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ ఎమ్. సందీప్ కుమార్, రిటర్నింగ్ అధికారులు మరియు పురపాలక సంఘ సిబ్బంది కూడా పాల్గొన్నారు.ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
