Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంనేరేడు చర్లలో జయలక్ష్మి ఫర్టిలైజర్ షాపు తనిఖీ విత్తన చట్టాల ప్రకారం వ్యాపారం చేయాలని సూచనలు

నేరేడు చర్లలో జయలక్ష్మి ఫర్టిలైజర్ షాపు తనిఖీ విత్తన చట్టాల ప్రకారం వ్యాపారం చేయాలని సూచనలు

డైనమిక్ ,నేరేడుచర్ల, అక్టోబర్ 28

నేరేడు చర్ల మండలంలోని జయలక్ష్మి ఫర్టిలైజర్ షాపును హుజూర్‌నగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు రవి, మండల వ్యవసాయ అధికారి డా. షేక్ జావేద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తనాల స్టాక్ రిజిస్టర్, సోర్స్ సర్టిఫికెట్లు, ఫిజికల్ స్టాక్‌ను పరిశీలించారు. విత్తన చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని షాప్ యజమానికి సూచించారు.

రైతులకు కీలక సూచనలు

లైసెన్స్ ఉన్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.కొనుగోలు సమయంలో కంపెనీ పేరు, వివరాలు సరిచూసుకొని బిల్లుతో కొనుగోలు చేయాలి.విత్తనాలు తీసుకున్న తర్వాత ముందుగా మండే కట్టి మొలక శాతం పరిశీలించి, సమస్య ఉంటే వెంటనే సంబంధిత డీలర్ లేదా అధికారులను సంప్రదించాలి. లూజ్‌గా లేదా విడిగా విత్తనాలు కొనరాదు. రైతులు తమ విత్తనాలను విక్రయించాలనుకుంటే ముందుగా సాగు వివరాలతో జిల్లా వ్యవసాయ అధికారి గారికి దరఖాస్తు చేయాలి. పరిశీలన అనంతరం అనుమతి పత్రం పొందిన తర్వాతే విక్రయించాలి.లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

చట్టబద్ధంగా వ్యవహరించాలి

విత్తన చట్టాలకు లోబడి వ్యాపారం చేయడం వల్లే రైతులకు నష్టం జరగదని, రైతులు జాగ్రత్తగా వ్యవహరించి మోసపోకుండా చూడాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments