డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 27
పోలీసు అమరులను స్మరించుకుంటూ సూర్యాపేట పట్టణంలో సోమవారం పోలీసు సంస్మరణ వారోత్సవాల భాగంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.జిల్లా పోలీసు అధికారి నరసింహ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. పోలీసు విభాగంలో విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తూ ఎస్పీ పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ –
“దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులు మనకు స్ఫూర్తిదాయకులు. వారి త్యాగాలను స్మరించుకోవడం మన అందరి బాధ్యత”అని తెలిపారు.బైక్ ర్యాలీ సూర్యాపేట పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో మారుమ్రోగించారు.



