నేరేడుచర్ల, సెప్టెంబర్ 10,శుభోదయ డైనమిక్ వార్త
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెం గ్రామంలో గురువారం పోషణ్ మేళా నిర్వహించారు. పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలతో పోషకాహారం తయారీపై అవగాహన కల్పించారు.
పోషకాహార వంటకాల ప్రదర్శన
చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల పోషకాహార వంటకాలను ప్రదర్శించారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వివరించారు.
గర్భిణులు, బాలింతలు, పిల్లల పాల్గొనడం
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయ, వార్డు కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్తో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

