శుభోదయ డైనమిక్ , మోతే, ఆగస్టు 17
మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన కీసర వెంకటరెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో మోతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, నామవరం మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ రామయ్యతో పాటు గ్రామ, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
