నేరేడుచర్ల, మే 8,శుభోదయ డైనమిక్ వార్త
పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్లలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు.
ఉదయం నుంచే శిక్షణ కార్యక్రమాలు
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు బట్టు మధు తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కల్పించినట్లు చెప్పారు.
వివిధ అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు
శిబిరంలో విద్యార్థులకు వివిధ రకాల క్రీడలు, యోగ, సంప్రదాయ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, వినోదాత్మక క్రీడలపై శిక్షణ అందిస్తున్నారు. అలాగే పఠన నైపుణ్యాలు, అందమైన చేతిరాత అభివృద్ధికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు ఎం. యాదగిరి తెలిపారు.
ఉపాధ్యాయుల భాగస్వామ్యం
కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. బాలు, డాన్స్ మాస్టర్ రాజు, వినోద్ కుమార్, నగేష్, సరస్వతి, సరిత తదితరులు పాల్గొని విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.
