Wednesday, July 29, 2026
Homeతాజా సమాచారంమట్టపల్లి అభివృద్ధికి రూ.13 కోట్లు..!లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మట్టపల్లి అభివృద్ధికి రూ.13 కోట్లు..!లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

శుభోదయ డైనమిక్ వార్త , మఠంపల్లి, జులై 17

హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేస్తూ గురువారం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు, బోటింగ్ సౌకర్యాలు, మౌలిక సదుపాయాల విస్తరణ చేపట్టనున్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తితో నిధుల మంజూరు

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) అధికారులు మట్టపల్లి క్షేత్రాన్ని పరిశీలించి రూ.13 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించారు. అనంతరం ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపింది.

ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు

మంజూరైన నిధులతో ఆలయ పరిసరాల్లో సందర్శకులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు, పర్యాటక మౌలిక వసతులు, విశ్రాంతి కేంద్రాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు. దీంతో క్షేత్రం మరింత ఆకర్షణీయంగా మారనుంది.

భక్తులకు మెరుగైన సేవలు

తెలంగాణ రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకుల రాక పెరగడంతో స్థానిక వ్యాపారాలు, చిన్న వ్యాపారులకు కూడా లాభం చేకూరనుంది.

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

పర్యాటక అభివృద్ధి పనుల ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మట్టపల్లి ప్రాంతం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.

హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

మట్టపల్లి పుణ్యక్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేయడంపై స్థానిక ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments