నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 9
నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం తెల్లవారుజామున వైద్య సిబ్బంది అప్రమత్తతతో సాధారణ ప్రసవం విజయవంతంగా జరిగింది.
పురిటి నొప్పులతో పి హెచ్ సీ కు వచ్చిన గర్భిణి
తండాకు చెందిన రూపావత్ స్వరూప (భర్త: లక్ష్మణ్) తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో పురిటి నొప్పులతో నేరేడుచర్ల పి హెచ్ సీ కు చేరుకుంది.
వెంటనే వైద్య చర్యలు
గర్భిణిని వెంటనే డాక్టర్ పున్న నాగిని పరిశీలించి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రసవానికి కావాల్సిన ఏర్పాట్లు చేపట్టారు.
ఉదయం 6:05కి ఆడబిడ్డ జననం
అన్ని వైద్య చర్యలు పూర్తి చేసిన అనంతరం తెల్లవారుజామున 6:05 నిమిషాలకు 2.8 కేజీల బరువుతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వైద్య సిబ్బంది పాత్ర
ఈ సాధారణ ప్రసవంలో డాక్టర్ పున్న నాగిని, నర్సింగ్ ఆఫీసర్ స్వాతి, ANM భూలక్ష్మి, ఆశా కార్యకర్త సైదమ్మ కీలక పాత్ర పోషించారు.
