పెనుకొండ, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రధాన ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి సవితమ్మ పిలుపునిచ్చారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ క్లస్టర్, యూనిట్ ఇన్చార్జ్లతో ఆమె సమావేశం నిర్వహించారు.
కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి
సమావేశంలో పాల్గొన్న క్లస్టర్, యూనిట్ ఇన్చార్జ్లతో మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. అనంతరం వారికి ఘనసన్మానం కూడా నిర్వహించారు.
“పార్టీలో పదవి గౌరవప్రదం” — సవిత
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ,
“పార్టీలో పదవి దక్కడం అంటే అది కేవలం బాధ్యత మాత్రమే కాదు, గౌరవప్రదమైన విషయం కూడా. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది” అని తెలిపారు.పార్టీ బలోపేతం కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి నూతన వన్నె
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రాన్ని అప్పుల బారినుండి బయటకు తీసుకువస్తూ అభివృద్ధి, సంక్షేమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారు” అని అభినందించారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా చేయాలి
ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి సేవలను ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు చేర్చే బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు.
క్లస్టర్–యూనిట్ ఇన్చార్జ్లు పార్టీకి వెన్నెముకలు
“బూత్ కన్వీనర్లు, యూనిట్, క్లస్టర్ ఇన్చార్జ్లు, గ్రామ–మండల–పట్టణ స్థాయి నాయకులు పార్టీకి వెన్నెముకలు. ప్రతి ఒక్కరూ సమర్థ వంతంగా పని చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది, ప్రజా విశ్వాసం మరింత పెరుగుతుంది” అని సవిత అన్నారు.
కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, సీనియర్ నాయకులు మాధవ నాయుడు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య తదితరులు పాల్గొన్నారు.
