Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంజాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ రోడ్డు ప్రమాదాల నివారణపై...

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం అని ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 6

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసులు, ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ కోర్టు చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్ జంక్షన్ వరకు కొనసాగింది.

మానవహారంతో సందేశం

ర్యాలీ అనంతరం కొత్త బస్టాండ్ ప్రాంగణంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి పౌరులు, వాహనదారులకు రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

ఈ సందర్భంగా ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ—
రోడ్డు ప్రమాదాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థి దశ నుండే రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు.

అతివేగం ప్రమాదకరం

వాహనదారులు అతివేగంగా వాహనాలు నడపకుండా డిఫెన్స్ డ్రైవింగ్ పాటించాలని సూచించారు. ప్రయాణ సమయంలో తీసుకునే ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్షగా మారుతాయని అన్నారు.

అనియంత్రిత పార్కింగ్ వల్ల ప్రమాదాలు

రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల వెనుక నుండి వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనల వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోందని గుర్తు చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు

మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల స్వయంగా మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించారు.

జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

జిల్లా పోలీస్ శాఖ, ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక పౌరులు, పోలీస్ సిబ్బంది, ఆర్టీఏ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments