నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీ దారులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా కలుసుకున్నారు. వారి సమస్యలను వివరంగా తెలుసుకుని వినతులు స్వీకరించారు.
అధికారులకు ఎస్పీ ఆదేశాలు: వేగంగా స్పందించండి
ప్రజలు తెలిపిన ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గ్రీవెన్స్ డే అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోలీస్ సేవల్లో పారదర్శకత–సమర్థతే లక్ష్యం
ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదులను స్వీకరించడం కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పనిచేస్తోందని, అందిన ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం పోలీస్ గ్రీవెన్స్ డే
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేను ఏర్పాటు చేస్తూ, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడమే లక్ష్యమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
