Monday, March 2, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్ల మున్సిపాలిటీలో ఏకగ్రీవ ఎన్నికలు ఛైర్మన్‌గా కొణతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా నూకల...

నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఏకగ్రీవ ఎన్నికలు ఛైర్మన్‌గా కొణతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా నూకల సందీప్ కుమార్ రెడ్డి

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, ఫైబ్రవరి 16

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడి ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయం, పరస్పర అవగాహనతో ఈ ఎన్నికలు ఎలాంటి పోటీ లేకుండా ముగియడం విశేషంగా నిలిచింది.

ఛైర్మన్‌గా కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

మున్సిపల్ ఛైర్మన్ పదవికి15 వ వార్డు కౌన్సిలర్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి పేరును నూకల సందీప్ కుమార్ రెడ్డి ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలీల్ మహ్మద్ బలపరిచారు. ఇతర సభ్యుల మద్దతుతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఎన్నికతో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వైస్ ఛైర్మన్‌గా నూకల సందీప్ కుమార్ రెడ్డి ఎన్నిక

వైస్ ఛైర్మన్ పదవికి 6వ వార్డు కౌన్సిలర్ నూకల సందీప్ కుమార్ రెడ్డి పేరును 4వ వార్డు కౌన్సిలర్ కొణతం మంజుల ప్రతిపాదించగా, 13వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి లక్ష్మయ్య బలపరిచారు. సభలో హాజరైన సభ్యుల సమ్మతితో ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సభ్యులు పరస్పరం అభినందనలు తెలియజేసి మున్సిపల్ పరిపాలనలో సమిష్టి కృషితో ముందుకు సాగాలని సంకల్పం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధుల హాజరు – అధికారుల పర్యవేక్షణ

ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఎంపీ రఘు వీర్ రెడ్డి హాజరై నూతనంగా ఎన్నికైన నాయకులను అభినందించారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అలాగే సూర్యాపేట జిల్లా జడ్‌పి సీఈఓ శిరీష, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు,ఎన్నికల అధికారి సందీప్, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, ఎస్‌ఐ రవీందర్‌తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొని ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి

నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల మెరుగుదల వంటి అంశాలపై ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతమైన పాలన అందించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఏకగ్రీవ ఎన్నికలు జరగడం రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా నిలిచిందని స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లు 2వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ, 4వ వార్డు కౌన్సిలర్,కొణతం మంజుల, 5వ వార్డు కౌన్సిలర్ నన్నపంగ శ్రీనివాస్, , 8వ వార్డు కౌన్సిలర్ లావణ్య, 9 వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మయ్య, 12వ వార్డు కౌన్సిలర్  అబ్దుల్ కలిల్ పాల్గొన్నారు 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments