మోతె, సెప్టెంబర్ 20,శుభోదయ డైనమిక్ వార్త
మోతె మండల ప్రింట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం వివరాలు
గౌరవ సలహాదారు: పోటు ఉపేందర్ రావు – ఈనాడు
గౌరవ అధ్యక్షులు: కాంపాటి వెంకన్న – సాక్షి, అనంతల యల్లయ్య – వార్త
అధ్యక్షులు: బత్తిని వెంకటేశం గౌడ్ – నవతెలంగాణ
ఉపాధ్యక్షులు: జిల్లపల్లి శివకృష్ణ – ఆంధ్రప్రభ, బానోత్ విఠల్ – నినాదం
ప్రధాన కార్యదర్శులు: భానోత్ నెహ్రూ – నమస్తే తెలంగాణ, లగిశెట్టి వెంకన్న – ఆంధ్రజ్యోతి
కోశాధికారి: కందిబండ గోపి – జ్యోతి
కార్యదర్శి: గునగంటి నాగరాజు గౌడ్ – మన తెలంగాణ
కార్యవర్గ సభ్యులు: కారింగుల స్టాలిన్ – విశాలాంధ్ర, ఎస్.కె. పాష – దిశ, కోల రవీందర్ – శుభోదయ డైనమిక్ వార్త , శ్రీకాంత్ – విశాల తెలంగాణ.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బత్తిని వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, జర్నలిస్టులందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మండలంలోని జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
