అమరావతి, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 21
మంగళగిరి 6వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్నారు –రాజకీయం ముసుగులో కొత్త నేరాలు జరుగుతున్నాయి. ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం,” అని స్పష్టం చేశారు.సమాజ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సీఎం నివాళులర్పించారు.
