డైనమిక్ న్యూస్, హుజూర్నగర్ | మార్చి 25
ప్రఖ్యాత స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, గీత పనివారాల సంఘం నిర్మాత, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించిన బొమ్మగాని ధర్మ భిక్షం 15వ వర్ధంతిని మార్చి 26 గురువారం ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.
ట్యాంకుబండ్పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ధర్మ భిక్షం సేవలను స్మరించుకునేలా హైదరాబాద్ ట్యాంకుబండ్పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
పాఠ్యాంశంగా జీవితం చేర్చాలి
విద్యార్థులకు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని, తద్వారా యువతకు ఆయన పోరాట స్ఫూర్తి తెలియజేయాలని సూచించారు.
జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి
ధర్మ భిక్షం జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సమావేశంలో కోరారు.
సూర్యాపేట జిల్లాకు పేరు మార్చాలి
సూర్యాపేట జిల్లాకు బొమ్మగాని ధర్మ భిక్షం పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య డిమాండ్ చేశారు.
