Saturday, March 21, 2026
Homeతాజా సమాచారంటేక్మాల్ 10వ వార్డులో తీరిన నీటి కష్టాలుకాలనీ వాసులకు ఉపశమనం – వేగంగా స్పందించిన ప్రజాప్రతినిధులు

టేక్మాల్ 10వ వార్డులో తీరిన నీటి కష్టాలుకాలనీ వాసులకు ఉపశమనం – వేగంగా స్పందించిన ప్రజాప్రతినిధులు

డైనమిక్ న్యూస్ | మార్చి 22 | టేక్మాల్

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయితీ పరిధిలోని 10వ వార్డులో నెలకొన్న తీవ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలకు ఇది ఊరట కలిగించింది.

వార్డు మెంబర్ చర్యలు – సర్పంచ్ స్పందన

వార్డు మెంబర్ లావణ్య బాలకృష్ణ తమ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సర్పంచ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు.

మంత్రి ఆదేశాలతో వేగవంతమైన చర్యలు

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సమాచారం అందించగా, ఆయన తక్షణమే స్పందించారు. కాలనీలో నీటి కొరత నివారణకు వెంటనే బోర్ వేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

యుద్ధ ప్రాతిపదికన బోరు ఏర్పాటు

మంత్రివర్యుల ఆదేశాల మేరకు శనివారం యుద్ధ ప్రాతిపదికన బోరు వేయడం జరిగింది. దీంతో కాలనీలో నీటి సమస్య పూర్తిగా తీరింది.

ప్రజల కృతజ్ఞతలు

తమ సమస్యను తక్షణమే పరిష్కరించినందుకు కాలనీ వాసులు మంత్రి దామోదర రాజనర్సింహ, సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, సీనియర్ నాయకులు సుబేధర్ మాన్ కిషన్, డీసీసీ జిల్లా కార్యదర్శి ఆశీలి విద్యాసాగర్, ఉప సర్పంచ్ మేకలకాడి శంకరయ్య, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, టౌన్ అధ్యక్షులు భక్తుల కిషోర్, వార్డు మెంబర్లు నాగులపల్లి సదాశివ గౌడ్, సోలాపూర్ రాజు, కుమ్మరి ధనంజయ్, కాలనీ వాసులు బాజా సత్తయ్య, భోగం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments