డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 17
మోతే మండలం సిరికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీయేనని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన స్పష్టం చేశారు.
సర్వమత సమానత్వమే కాంగ్రెస్ లక్ష్యం
దేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, వారి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.
రంజాన్ సందర్భంగా బట్టల పంపిణీ
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని ముస్లిం సోదర సోదరీమణులకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న నేతలు
అనంతరం ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కీసర సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బుర్ర వెంకటేష్, ఉప సర్పంచ్ రావుల రాజీవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మందడి శివరంజన్ రెడ్డి, నందిగామ రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మైనార్టీ నాయకులు, వార్డు సభ్యులు మరియు ఇతర గ్రామ నాయకులు పాల్గొన్నారు.
