Thursday, March 19, 2026
Homeతాజా సమాచారంకనకదుర్గమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం – ఉగాది పర్వదినం సందర్భంగా విశేష కార్యక్రమాలు

కనకదుర్గమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం – ఉగాది పర్వదినం సందర్భంగా విశేష కార్యక్రమాలు

డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 19

తెలుగు సంవత్సరాది పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో గురువారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం నిర్వహించారు.

– ప్రధాన అర్చకుల చేత పంచాంగ పఠనం

ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాధుని రంగభట్టాచార్యులు సాయంత్రం 6:30 గంటలకు పంచాంగాన్ని శ్రవణం చేశారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.

– భక్తుల భారీ పాల్గొనడం

ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు బాచిమంచి కొండయ్య–అనంతలక్ష్మి దంపతులు, బాచిమంచి చంద్రం, హుజూర్‌నగర్‌కు చెందిన ప్రముఖులు ముటుకుల విజయకుమార్, ఆకుల రాము, భువనగిరి శ్యామ్, కంచర్ల రవీందర్ రెడ్డి, పులిచింతల సత్యనారాయణ రెడ్డి, శివకుమార్, నాగశ్రీ వెంకటరమణ, చింతలపూడి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

– ఉగాది సందర్బంగా ప్రత్యేక పూజలు

ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments