డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 14
కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ఆదివారం మోతే మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ప్రకటించారు.
పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొనడం
ఉదయం 10 గంటలకు సూర్యాపేటలోని జయ ఫంక్షన్ హాల్లో మాజీ ఎంపీటీసీ గుండెపురి వెంకన్నకు నిర్వహించే నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొననున్నారు.
ఉప్పలమ్మ పండుగ వేడుకల్లో హాజరు
మధ్యాహ్నం 2 గంటలకు విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉప్పలమ్మ పండుగ వేడుకల్లో పాల్గొంటారు.
పలు కుటుంబాలను పరామర్శ
మధ్యాహ్నం 2:15 గంటలకు స్వర్గీయ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని, 2:30 గంటలకు స్వర్గీయ దోరమల వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు.
2:40 గంటలకు గోపతండలో భుఖ్య సూర్య నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ
మధ్యాహ్నం 3:30 గంటలకు గోల్కొండలో ధారావత్ హర్ష కుటుంబాన్ని పరామర్శిస్తారు.
3:45 గంటలకు బురకచర్ల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోట మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.4 గంటలకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దారావత్ రవి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
సిరికొండలో పరామర్శ
సాయంత్రం 4:15 గంటలకు సిరికొండ గ్రామంలో నందిగామ రంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభం
సాయంత్రం 5 గంటలకు రాఘవపురం ఎక్స్ రోడ్డులోని ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో నూతన మినీ ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించనున్నారు.
