కారంపూడి, ఫిబ్రవరి 23 డైనమిక్ న్యూస్
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని Saint John’s English Medium High Schoolలో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.వి. కృష్ణారావు ఆదేశాల మేరకు సిఐ శరత్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది.
ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్తో ప్రత్యేక చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ విద్యార్థులను మత్తు పదార్థాల దుష్పరిణామాలపై చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు.
మత్తు పదార్థాల అమ్మకాలపై కఠిన చర్యలు
గంజాయి, తంబాకు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని సిఐ హెచ్చరించారు. అమ్మకాలు జరిపే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో పాఠశాలలు, కళాశాలల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధిత వస్తువుల అమ్మకాలను పూర్తిగా అరికట్టనున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు భవిష్యత్తుపై దిశానిర్దేశం
గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు.“డ్రగ్స్ వద్దు – చదువు ముద్దు” అనే నినాదంతో ప్రతి విద్యార్థి చదువులో రాణించి తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని సూచించారు. డ్రగ్స్కు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అనిల్ కుమార్, ఈగల్ టీమ్ సభ్యులు, సిబ్బంది రామకృష్ణ, సురేష్, మల్లీశ్వరి, జానీ తదితరులు పాల్గొన్నారు.డ్రగ్స్కు దూరంగా ఉండండి – విద్యతో ఉన్నత స్థానాలు అధిరోహించండి అని పోలీసులు విద్యార్థులకు పిలుపునిచ్చారు.

