Saturday, April 18, 2026
Homeతాజా సమాచారంలాల్ లక్ష్మీపురంలో ప్రజాబాట – విద్యుత్ సమస్యలపై అధికారుల ప్రత్యక్ష పరిశీలనట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఎత్తు పెంచేందుకు...

లాల్ లక్ష్మీపురంలో ప్రజాబాట – విద్యుత్ సమస్యలపై అధికారుల ప్రత్యక్ష పరిశీలనట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఎత్తు పెంచేందుకు తక్షణ చర్యలు

నేరేడుచర్ల, ఫిబ్రవరి 17, డైనమిక్ న్యూస్

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు చేపట్టిన “ప్రజా బాట” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు. గ్రామ సర్పంచ్ పర్వతం చిన్న వెంకన్న సమన్వయంతో విద్యుత్ ఏఈ సృజన గ్రామంలోని పలు విద్యుత్ సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెపై ఆందోళన

గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె చాలా కిందికి ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సర్పంచ్ వెంకన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దిమ్మె తక్కువ ఎత్తులో ఉండటం వల్ల కరెంట్ షాక్‌కు గురై మేకలు వంటి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తులో మరింత ప్రమాదాలకు దారితీసే అవకాశముందని తెలిపారు.

అధికారుల తక్షణ స్పందన

సమస్యను గమనించిన ఏఈ సృజన వెంటనే స్పందిస్తూ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఎత్తు పెంచే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సంబంధిత సిబ్బందికి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. లైన్‌మెన్ నరసింహ రెడ్డికి దిమ్మె ఎత్తు పెంపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

గ్రామస్తుల సంతృప్తి

అధికారులు తక్షణమే స్పందించి చర్యలు ప్రారంభించడంపై గ్రామ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాబాట కార్యక్రమం ద్వారా గ్రామీణ సమస్యలు ప్రత్యక్షంగా పరిష్కార దిశగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో లైన్‌మెన్‌లు, గ్రామ పంచాయతీ సిబ్బంది గౌస్, ఆదినారాయణ, గ్రామ ప్రజలు సంజీవ తదితరులు పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments