మఠంపల్లి, డిసెంబర్ 2,డైనమిక్ న్యూస్
గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలకు గాను మూడవ దశలో ఎన్నికలు జరగనున్న మఠంపల్లి మండలంలో 29 గ్రామపంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు మండల యంత్రాంగం ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారని మఠంపల్లి ఎం పి డి ఒ జగదీష్ తెలిపారు.బుధవారం ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మండలంలో ఏర్పాటు చేయబడిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలలో నామినేషన్లు దాఖలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని మఠంపల్లి ఎం పి డి ఒ జగదీష్ తెలిపారు.
