నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, జూన్ 27
మాజీ ఐ పియస్ అధికారి, బి యస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు కల్పించిన X-కేటగిరీ భద్రతను ప్రభుత్వం తొలగించడాన్ని మాజీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నందిపాటి గురవయ్య తీవ్రంగా ఖండించారు.
కక్షసాధింపు చర్యలేనా?
దేశానికి సేవలందించిన, రాష్ట్రపతి శౌర్య పతకం పొందిన అధికారిపై భద్రత ఉపసంహరణ కక్షసాధింపు చర్యగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
భద్రత పునరుద్ధరించాలి
ప్రవీణ్ కుమార్కు తక్షణమే X-కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకను అణచివేసే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని గురవయ్య డిమాండ్ చేశారు.
