మఠంపల్లి, నవంబర్ 30 (డైనమిక్ న్యూస్):
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ పరిధిలో ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా కుక్కల రమణ రాములు ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
వార్డు అభ్యర్థుల ఎంపిక
అదేవిధంగా గ్రామపంచాయతీ వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ వార్డులకు కింది విధంగా అభ్యర్థులు ఎంపికయ్యారు.
రెండవ వార్డు: కొత్తూరు వెంకన్న
మూడవ వార్డు: ఉపేందర్
నాలుగో వార్డు: బుడిగె బాలరాజు జ్యోతి
ఏడవ వార్డు: బుడిగ సీను
పార్టీ నేతల అభినందనలు
ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ మండల, గ్రామ నాయకులు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేస్తామని అభ్యర్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
