Thursday, March 26, 2026
Homeతాజా సమాచారంమెదక్ కాంగ్రెస్‌లో విషాదం: సీనియర్ నేత గంటా రాజు కన్నుమూత

మెదక్ కాంగ్రెస్‌లో విషాదం: సీనియర్ నేత గంటా రాజు కన్నుమూత

టేక్మాల్, మార్చి 27 ,డైనమిక్ న్యూస్

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. మెదక్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా రాజు గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

అనారోగ్యంతో తుదిశ్వాస

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంటా రాజు గారి ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పార్టీకి, పట్టణ అభివృద్ధికి కీలక సేవలు

మెదక్ పట్టణ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఆయన విశేష కృషి చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను స్థానిక నాయకులు గుర్తు చేసుకున్నారు.

నాయకుల్లో దిగ్భ్రాంతి

గంటా రాజు గారి మరణవార్తతో మెదక్ పట్టణంలోని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments