Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కారంపూడి మెయిన్ సెంటర్‌లో చింత చెట్టు విరిగి ట్రాఫిక్‌కు అంతరాయం

కారంపూడి మెయిన్ సెంటర్‌లో చింత చెట్టు విరిగి ట్రాఫిక్‌కు అంతరాయం

కారంపూడి,డైనమిక్, నవంబర్9

కారంపూడి మండల కేంద్రంలోని పోలురెడ్డి టీ కొట్టు వద్ద ఆదివారం ఉదయం భారీ చింత చెట్టు ఆకస్మికంగా విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ సమయానికి రహదారిపై వాహనాలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.చెట్టు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉండటంతో, స్థానికులు అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేయడం ద్వారా ప్రాణాపాయం తప్పించారు. ఈ ఘటనతో కొంతసమయం పాటు వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. త్వరగా చెట్టు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments