Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారందిత్వా తుఫాన్ ప్రభావం : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి– సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ...

దిత్వా తుఫాన్ ప్రభావం : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి– సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ విజ్ఞప్తి

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,30 నవంబర్

దిత్వా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ సూచించారు.

గాలుల తీవ్రత పెరిగే అవకాశం

తుఫాన్ ప్రభావంతో చలి గాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా బలమైన ఈదురుగాలులు, ఆకస్మిక వర్షపాతంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తత పాటించాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బోర్డులు వంటి ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు.

రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

రైతులు తమ వరి ధాన్యం తడవకుండా పట్టాలతో కప్పివేసుకోవాలని, పంటల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.

పోలీస్ శాఖ అప్రమత్తం

తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని ఎస్పీ తెలిపారు. సిబ్బంది సెలవులను రద్దు చేసి విధుల్లో నియమించినట్లు స్పష్టం చేశారు.

అత్యవసర సహాయం కోసం సంప్రదించండి

ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 100 నంబర్‌కు లేదా సూర్యాపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 87126 86026 కి సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments