డైనమిక్ న్యూస్, హుజూర్నగర్, ఏప్రిల్ 10
హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగి, సాముల రామిరెడ్డి ప్యానెల్ నుంచి పోటీ చేసిన అడ్వకేట్ నారపరాజు శ్రీనివాసరావు భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు.
ఇతర పదవుల్లో విజేతలు
ఈ ఎన్నికల్లో అదే ప్యానెల్కు చెందిన అభ్యర్థులు వివిధ పదవుల్లో గెలుపొందారు.
జనరల్ సెక్రటరీగా ఆర్.వి. రమణారెడ్డి
జాయింట్ సెక్రటరీగా రమాదేవి
ట్రెజరర్గా గొట్టే ప్రశాంత్
స్పోర్ట్స్ సెక్రటరీగా అడవి రాముడు
లైబ్రరీ సెక్రటరీగా దూదిపాల శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ సభ్యులు
ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా జక్కుల నవీన్, చిట్టిపోతుల రమేష్, నాగపాష, బుడిగ నరేష్ విజయం సాధించారు.
ఉత్సాహంగా స్పందించిన న్యాయవాదులు
ఎన్నికల ఫలితాల అనంతరం విజేతలను సహచర న్యాయవాదులు అభినందించారు. నూతన కమిటీ హుజూర్నగర్ బార్ అభివృద్ధికి కృషి చేస్తామని విజేతలు తెలిపారు.
