హైదరాబాద్ , డైనమిక్ డెస్క్,నవంబర్ 16
చత్తీస్గఢ్లో మావోయిస్టు చట్రం మరోసారి కదిలింది. అడవుల్లో భయానక కాల్పుల దాడులు చోటుచేసుకుంటుండగా, సూక్మా జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో పోలీసులకు పెద్ద విజయమే లభించింది. మూడు మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం.
చింతగుఫా పరిధిలో ఉదయం ఘర్షణ
అధికారుల ప్రకారం ఆదివారం ఉదయం చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు ప్రతిస్పందించిన భద్రతా దళాలు తిరుగుబాటు దళాలతో సుమారు గంటకు పైగా తూటాలు మార్పించుకున్నాయి.
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతం
ఈ భారీ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. పరిస్థితి దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రాంతంలో ఇంకా కొంతమంది మావోయిస్టులు దాక్కున్నట్టు అనుమానిస్తున్న నేపథ్యంలో దళాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.
ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం
ఎన్కౌంటర్ చోటుచేసుకున్న ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసిన భద్రతా బలగాలు అక్కడ నుంచి పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. అడవి ప్రాంతమంతా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
