డైనమిక్ న్యూస్, మాసాయిపేట, మార్చి 18
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ సందేశం
సమాజంలో సౌహార్ద్రత, సోదరభావం పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు మంచి వేదికగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు శాంతి, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పసుల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధ రాములు గౌడ్, పోతనపల్లి సర్పంచ్ మాధవరెడ్డి, వార్డు సభ్యులు, పోతంశెట్టిపల్లి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ నాయకుల సమన్వయం
మండల మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ మక్సుద్ ఆధ్వర్యంలో గ్రామ మైనార్టీ అధ్యక్షుడు ముజాయిద్దీన్, కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధి శివ రాములు, కార్యకర్తలు బాలేష్, సాయికుమార్, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
భారీ స్పందన
ఈ ఇఫ్తార్ విందుకు మైనార్టీ సోదరులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

