డైనమిక్ ,సూర్యాపేట బ్యూరో
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగతో తెలంగాణ లోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లి విరియాలన్నారు. అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించాలన్నారు. అలాగే బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.చిన్నపిల్లలను బాణాసంచాకు దూరంగా ఉంచాలని సూచించారు
