Thursday, January 15, 2026
Homeతెలంగాణమెగా ఉద్యోగ మేళా ప్రాంగణం పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ

మెగా ఉద్యోగ మేళా ప్రాంగణం పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ

డైనమిక్, హుజూర్ నగర్, అక్టోబర్ 17

ఈ నెల 25వ తేదీన హుజూర్నగర్ పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న మెగా ఉద్యోగ మేళా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ  శుక్రవారం స్వయంగా పరిశీలించారు.

20 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం

ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 20 వేల మంది అభ్యర్థులు పాల్గొననున్నట్లు అంచనా వేస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు. భారీ జనసందోహం నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాలతో సమన్వయం కల్పించామని వెల్లడించారు.

150 కంపెనీలు పాల్గొనే భారీ ఉద్యోగ మేళా

ఈ మేళా రాష్ట్ర డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ అథారిటీ మరియు సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాదాపు 150 కంపెనీలు ఇందులో పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని ఎస్పీ నరసింహ తెలిపారు. మేళా సజావుగా సాగేందుకు అవసరమైన ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించినట్లు చెప్పారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి — ఎస్పీ నరసింహ

ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. “ప్రతి అవకాశాన్ని విజయంగా మలచుకోవడం మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలు ఇస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే వారిని నమ్మొద్దు, వెంటనే పోలీసులకు తెలియజేయాలి” అని ఆయన హెచ్చరించారు.స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్సై మోహన్ బాబు, అలాగే ఉద్యోగ మేళా నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments