Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లింపు ప్రణాళిక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లింపు ప్రణాళిక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

డైనమిక్ డెస్క్, ఏపీ,అక్టోబర్ 24

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.అటవీ శాఖ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా “గ్రేట్ గ్రీన్ వాల్” నిర్మాణానికి కృషి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. అడవుల సంరక్షణతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments